CTR: రామకుప్పంలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ పునర్నిర్మాణానికి దేవాదాయ శాఖ రూ.3.49 కోట్లు మంజూరు చేసినట్లు మండల టీడీపీ అధ్యక్షుడు ఆనందరెడ్డి స్పష్టం చేశారు. ఆలయంతో పాటుగా అభిషేక మండపం నిర్మాణం జరగనుందని ఆయన పేర్కొన్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన సుబ్రమణ్య స్వామి ఆలయ అభివృద్ధి చేస్తుండటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.