EG: పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) కార్యాలయాన్ని హైదరాబాద్ నుండి రాజమహేంద్రవరంకి తరలించాలని కేంద్ర జలశక్తి శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్ పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వేగవంతమైన పర్యవేక్షణ క్షేత్రస్థాయికి కార్యాలయం దగ్గరగా ఉండటం వల్ల పనుల పురోగతి పర్యవేక్షించడం సులభమవుతుంది.
VZM: చీపురుపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం సీఐ శంకర్రావు ,ఎస్సై దామోదర్ రావు నాగబంది నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులు లేని వెహికల్స్ను సీజ్ చేశారు. ప్రతి ఒక్కరికి రోడ్ సేఫ్టీలో భాగంగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు. అలాగే, మద్యం సేవించి వాహనం నడపరాదని అన్నారు.
NRPT: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 90 రోజుల కార్యక్రమం నిర్వహణపై గురువారం నారాయణపేటలోని నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో జిల్లాలోని ఆశాలు, సూపర్వైజర్లకు అవగాహన కల్పించినట్లు DMHO జయ చంద్రమోహన్ తెలిపారు. మెటర్నల్ హెల్త్, చైల్డ్ ఇమ్యూనైజేషన్ కార్యక్రమాల నిర్వహణపై అవగాహన కల్పించారు. వైద్య శాఖ సూచించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.
అనంతపురంలో కూటమి నేతల అవినీతిపై విచారణకు సిద్ధమా అని మేయర్ మహమ్మద్ వసీం సవాల్ విసిరారు. గురువారం కార్పొరేటర్లతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, అదనపు ట్రాక్టర్లు ఉన్నా చెత్త సేకరణ జరగడం లేదని విమర్శించారు. భవన నిర్మాణ అనుమతుల విషయంలో కూటమి నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
RR: ఈరోజు సరూర్ నగర్ SE సర్కిల్ కార్యాలయం వద్ద చంపాపేట్, ఇబ్రహీంపట్నం, సరూర్ నగర్ డివిజన్ల మీటర్ రీడర్లు టెంట్లు వేసి ధర్నా చేపట్టారు. అలాగే వంట-వార్పు కార్యక్రమం నిర్వహించారు. నెలకు 30 రోజుల పని దినాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి రాజకీయ నాయకులను కలిసి తమ సమస్యను వివరిస్తామని తెలిపారు.
అన్నమయ్య: మదనపల్లె మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. మదనపల్లె నుంచి తిరుపతి వైపు వెళుతుండగా సీటీఎం రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన దంపతులను స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా, వారి వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీకాకుళంలో డయేరియా ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు పారిశుధ్య పనుల్లో ఎక్కడా అలసత్వం వహించకూడదని జేసీ, నగరపాలక సంస్థ ఇంఛార్జ్ కమిషనర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఆయన నగరంలోని డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో మురుగు కాలువల పూడికతీత పనులను పరిశీలించారు.
ELR: ముదినేపల్లి మండలం పెదకామనపూడికి చెందిన దొండపాటి వరప్రసాద్(22) గురువారం మృతి చెందాడు. చెరువు గట్ల కోసం మట్టి తోలుతుండగా ట్రాక్టర్ దిగబడి ఉన్న దాన్ని మరో ట్రాక్టర్తో బయటకు లాగే క్రమంలో ప్రమాదవశాత్తు వాటి మధ్య ఇరుక్కుపోయి యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
AKP: పునర్వనంపై వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పాలసీని తీసుకొస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎలమంచిలిలో రోడ్డు విస్తరణలో తొలగించిన వృక్షాలను పునర్వనం కార్యక్రమంలో మరో చోట నాటినట్లు పవన్ కళ్యాణ్కు ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ వివరించారు. ఇది మంచి కార్యక్రమమని చెట్లు తొలగించవలసి వస్తే ఇదేవిధంగా నాటే విధంగా ఒక విధానాన్ని తీసుకొస్తామన్నారు.
MHBD: కేసముద్రం మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా యాకాంబ్రం, ఉపాధ్యక్షులుగా విక్రమ్, శ్రీరాములు, కోశాధికారిగా ఉమేష్, జాయింట్ సెక్రెటరీగా మహేందర్లు ఎన్నికయ్యారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారదులుగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
తిరుపతి జిల్లాలో 11-03-2026 నుంచి 16-03-2026 వరకు దివ్యాంగులు, వయోవృద్ధులకు సహాయ పరికరాల శిబిరాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ALIMCO సహకారంతో సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శిబిరాలు విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
ఇంగ్లండ్తో జరుగుతున్న ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. సంజూ శాంసన్ 89 పరుగులతో విధ్వంసం సృష్టించగా, దూబే (43), కిషన్ (39) మెరుపులు మెరిపించారు. చివర్లో పాండ్యా (27), తిలక్ (21) కూడా ధాటిగా ఆడటంతో భారత్ 20 ఓవర్లలో 253/7 పరుగులు చేసింది. సూర్య(11), అభిషేక్ (9) నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్స్, రషీద్ చెరో రెండు వికెట్లు తీశారు.
BDK: జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ భద్రాద్రి కొత్తగూడెం పరిధిలో ఉన్న లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్, కొత్తగూడెం లో ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ / క్లర్క్ -01 పోస్టుకు దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ గురువారం ప్రకటనలో తెలిపారు. కావున ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఖమ్మం జిల్లాలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మార్చి 6 నుంచి 15 వరకు గ్రామాలు పట్టణాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం అధికారులతో జరిగిన సమీక్షలో ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్లను 10 రోజుల్లో క్లియర్ చేయాలని సూచించారు.
MDK: పీఎం సూర్య ఘర్ పథకంతో గృహాలపై సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని విద్యుత్ ఖర్చులు తగ్గించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో పీఎం సూర్యగ్రహ ప్రచార వాహనాన్ని జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. మండలాలు, గ్రామాలలో పర్యటించి పథకం గురించి అవగాహన కల్పించి మార్గనిర్దేశం చేస్తుందన్నారు.