అన్నమయ్య: మదనపల్లె మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. మదనపల్లె నుంచి తిరుపతి వైపు వెళుతుండగా సీటీఎం రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన దంపతులను స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా, వారి వివరాలు తెలియాల్సి ఉంది.