శ్రీకాకుళంలో డయేరియా ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు పారిశుధ్య పనుల్లో ఎక్కడా అలసత్వం వహించకూడదని జేసీ, నగరపాలక సంస్థ ఇంఛార్జ్ కమిషనర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఆయన నగరంలోని డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో మురుగు కాలువల పూడికతీత పనులను పరిశీలించారు.