తిరుపతి జిల్లాలో 11-03-2026 నుంచి 16-03-2026 వరకు దివ్యాంగులు, వయోవృద్ధులకు సహాయ పరికరాల శిబిరాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ALIMCO సహకారంతో సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శిబిరాలు విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.