• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి: ఈటెల

BHPL: మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను భూపాలపల్లి, హనుమకొండ జిల్లాలకు చెందిన నేతలు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేస్తూ రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, కార్యకర్తలకు అండగా ఉంటామని ఈటెల అన్నారు.

March 20, 2026 / 07:55 PM IST

పట్టాలిచ్చారు.. స్థలాలెక్కడ..?

SRPT: సూర్యాపేట మండలం ఇమ్మంపేటలో 62 మంది బేడ బుడగ జంగాలకు ఇళ్ల పట్టాలిచ్చి, స్థలాలు చూపడం లేదని హక్కుల దండు అధ్యక్షుడు బాణాల వెంకన్న మండిపడ్డారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించారు. 15 ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని, వెంటనే తమకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

March 20, 2026 / 07:52 PM IST

ఇళ్లపై వేలాడుతున్న విద్యుత్ తీగలు… ప్రమాద భయం

WGL: పర్వతగిరి మండలం రావూరులో ఇళ్లపైగా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తీగలు ఇళ్లకు అత్యంత సమీపంలో ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, వెంటనే సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

March 20, 2026 / 07:50 PM IST

ఇసుకను తరలించ వద్దంటూ నిరసన

NZB: గ్రామ వనరులైన ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించవద్దని డిమాండ్ చేస్తూ వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామ రైతులు, ప్రజలు శుక్రవారం భారీ ఎత్తున నిరసన చేపట్టారు. గ్రామంలో అత్యవసర సమావేశం నిర్వహించిన అనంతరం, అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నాకు దిగారు.

March 20, 2026 / 07:50 PM IST

అక్కమాంబ జాతరలో భారీ అన్నదానం

ATP: కళ్యాణదుర్గం శ్రీ అక్కమాంబ జాతరలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ ఘనంగా జరుగుతోంది. జాతరకు వచ్చే భక్తులు ఆకలితో వెళ్లకూడదనే లక్ష్యంతో లక్ష మందికి పైగా భోజన వసతి కల్పించారు. కర్ణాటక నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. స్థానిక నాయకులు స్వయంగా వడ్డిస్తూ సేవలందిస్తున్నారు.

March 20, 2026 / 07:50 PM IST

‘సేంద్రియ ఎరువుల తయారీపై దృష్టి పెట్టాలి’

AKP: సంపద కేంద్రాల ద్వారా సేంద్రియ ఎరువుల తయారీపై పంచాయతీ కార్యదర్శులు దృష్టి పెట్టాలని గ్రామీణ మంచినీటి విభాగం జిల్లా కన్సల్టెంట్ లోవరాజు సూచించారు. శుక్రవారం నాతవరం మండలం శృంగవరంలో సంపద కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా తయారవుతున్న సేంద్రియ ఎరువును పరిశీలించారు. మార్కెట్‌లో సేంద్రియ ఎరువుకు మంచి డిమాండ్ ఉందన్నారు.

March 20, 2026 / 07:49 PM IST

‘ట్రాఫిక్ సమస్యకు సమగ్ర ప్రణాళిక సిద్ధం’

VSP: ఆనందపురం కూడలిలో ట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్‌హరేందిర ప్రసాద్‌ ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు సూచించారు. ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు పూలమార్కెట్‌ను తరలించడం, ఫ్లైఓవర్ కింద విస్తరణ వంటి చర్యలను పరిశీలిస్తున్నామన్నారు.

March 20, 2026 / 07:48 PM IST

పెద్దపులి దాడిలో పశువుల యజమానులకు నష్టపరిహారం

కాకినాడ జిల్లా ఏలేశ్వరం రేంజ్ పరిధిలో గత 10రోజులుగా సంచరించిన రాయల్ బెంగాల్ టైగర్ రాజవొమ్మంగి రేంజ్ పరిధిలోనికి వెళ్ళిపోయింది. పులి దాడిలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో చనిపోయిన పశువుల యజమానులు నెక్కంటి శ్రీనివాసరావు రూ.16వేలు, బొట్ట చిన్న సత్యనారాయణ రూ.25వేలు, పోలెం తమ్మయ్య రూ.25వేలు చొప్పున MLA వరుపుల సత్యప్రభ రాజా నష్టపరిహారము డి.డి రూపంలో అందిచారు.

March 20, 2026 / 07:48 PM IST

కనిపించిన నెలవంక.. రేపే ఈద్-ఉల్-ఫితర్

NZB: ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక దర్శనమివ్వడంతో శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. నెలవంక కనిపించిన వెంటనే ఒకరికొకరు ఈద్ కా చాంద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.

March 20, 2026 / 07:48 PM IST

కనిపించిన నెలవంక.. రేపే రంజాన్..!

NZB: ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక దర్శనమివ్వడంతో శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. నెలవంక కనిపించిన వెంటనే ఒకరికొకరు ఈద్ కా చాంద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.

March 20, 2026 / 07:48 PM IST

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కావ్య

WGL: పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ఆత్మశుద్ధి, నియమ నిష్ఠలు, సహనం, దాతృత్వం వంటి మహత్తర విలువలను పెంపొందించే పవిత్ర కాలమని ఎంపీ పేర్కొన్నారు. రంజాన్ పర్వదినం అందరి జీవితాల్లో ఆనందం, శాంతి, సుఖసంతోషాలను నింపాలని ఆకాంక్షించారు.

March 20, 2026 / 07:46 PM IST

తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు తిరుమల చేరుకున్నారు. ఆయన వెంట భువనేశర్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్ ఉన్నారు. ఈ మేరకు రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని సీఎం కుటుంబం దర్శించుకోనుంది. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా స్వామివారి సేవలో పాల్గొననున్నారు. అనంతరం ఎస్సీ అన్నప్రసాదం ట్రస్టుకు ఒకరోజు అన్నవితరణ ఖర్చు ఇవ్వనున్నారు.

March 20, 2026 / 07:45 PM IST

ములుగులో రంజాన్ తోఫాల పంపిణీ

ములుగు మండలంలోని పలువురు ముస్లిం సోదర, సోదరీమణులకు స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. రంజాన్ పండుగను ములుగు మండల వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం సమాన ప్రాధాన్యతను ఇస్తుందని నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నేతలు ఉన్నారు.

March 20, 2026 / 07:45 PM IST

మున్సిపల్ కమిషనర్లతో అదనపు కలెక్టర్ సమావేశం

BHNG: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తన ఛాంబర్‌లో మున్సిపల్ కమిషనర్లతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, ఆస్తి పన్ను, దుకాణాల అద్దె వసూలు, జనన-మరణ నమోదు, వేసవిలో తాగునీటి సరఫరా, వీధి కుక్కల నియంత్రణ వంటి విషయాలపై చర్చించారు.

March 20, 2026 / 07:45 PM IST

అటవీ శాఖ అవనిగడ్డ రేంజ్ అధికారిగా కే. కుమార్

కృష్ణా: అటవీ శాఖ అవనిగడ్డ రేంజ్ అధికారిగా కే. కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదును మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. కొద్దిసేపు వారితో సమావేశమై తమ శాఖ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలు వివరించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ సెక్షన్ అధికారిణి నాగమణి, ఎఫ్.బీ.వో సత్యనారాయణ పాల్గొన్నారు.

March 20, 2026 / 07:45 PM IST