BHNG: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తన ఛాంబర్లో మున్సిపల్ కమిషనర్లతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, ఆస్తి పన్ను, దుకాణాల అద్దె వసూలు, జనన-మరణ నమోదు, వేసవిలో తాగునీటి సరఫరా, వీధి కుక్కల నియంత్రణ వంటి విషయాలపై చర్చించారు.