MBNR: ఎంపీ డీకే అరుణ శనివారం జడ్చర్లలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలు ప్రారంభించారు. పోచమ్మగుడి ఊరచెరువు అభివృద్ధికి అమృత్ 2.0 పథకంలో భాగంగా రూ.కోటి,11లక్షల నిధులతో చేపట్టబోయే పనులకు ఆమె భూమిపూజ చేశారు. డీకే అరుణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.