BDK: అశ్వాపురం మండలం బుడుగు బజార్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి, పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం కావాలని సూచించారు. రెండో విడతలో మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.