KRNL: ఆలూరు మండలం కమ్మరచేడులో ఈనెల 27న జరగనున్న శ్రీరామనవమి వేడుకల సందర్భంగా గ్రామస్థులు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. గ్రామ పెద్దలు, యువకులు ఆయనను కలుసి కార్యక్రమానికి విచ్చేసి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.