టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న మూవీ ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ఈ సినిమాలో సాయి తేజ్, వేద జలంధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమాకు వి. మునిరాజు దర్శకత్వం వహిస్తున్నాడు.