SDPT: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి దేవస్థాన హుండీల లెక్కింపు ఈ నెల 26న నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తులు సమర్పించిన నగదు, బియ్యం హుండీల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. సంబంధిత శాఖల అధికారులు, బ్యాంక్ సిబ్బంది తప్పనిసరిగా హాజరుకావాలని ఆలయ ఈవో సూచించారు.