GNTR: పొన్నూరు మండలం ములుకుదురులోని శ్రీ చెన్నకేశవస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ దాసరి సింగయ్య శనివారం విడుదల చేశారు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 6 వరకు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.