NZB: ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామంలో ఈ నెల 29న నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు గుండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. హిందూ సమ్మేళనానికి కుటుంబ సమేతంగా విచ్చేసి, హిందూ చైతన్యం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ క్షేత్రాల హిందూ యువత పాల్గొన్నారు.