MBNR: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కుల వృత్తుల వారు, చేతివృత్తుల వారు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో కులవృత్తుల సంఘాలతో ఎంపీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వర్ణకారులు, గొల్ల కురుమలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయని వెల్లడించారు.