NZB: తొమ్మిది రోజులుగా రైల్వే ట్రాక్ మరమ్మతులతో మూసి ఉంచిన ఇందల్వాయి రైల్వే గేట్ శనివారం మధ్యాహ్నం తెరుచుకుందని సీనియర్ సెక్షన్ ఇంజినీర్ రవి నాగ శంకర్ తెలిపారు. తొమ్మిది రోజులుగా ధర్పల్లి, సిరికొండ, భీమగల్ మండలాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు శనివారం రైల్వే ట్రాక్ పనులు ముగియడంతో గేటును తెరిచారు.