NDL: చాగలమర్రి మండలం రాంపల్లి-నేలంపాడు మధ్య ఇవాళ ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న మహబూబ్ బాషా (28) తీవ్రంగా గాయపడ్డాడు. అతని కుడి కాలు, కుడి చేతి వేళ్లు విరిగాయి. స్థానికులు 108 ద్వారా ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు జంగాలపల్లి నుంచి చాగలమర్రికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.