HYD: లేక్ PS, సికింద్రాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ సంయుక్తంగా ఖైరతాబాద్ మ.సీ. మర్థా ప్రాంతంలో గంజాయి రవాణాను భగ్నం చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. దీపక్ పాండా, కుముదిని పాండా, సోను కుమార్ను అదుపులోకి తీసుకుని 1.4 కిలోల గంజాయి, 10 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఒడిశా నుంచి గంజాయి తెప్పించి నగరంలో విక్రయిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు.