WGL: పర్వతగిరి మండలం రావూరులో ఇళ్లపైగా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తీగలు ఇళ్లకు అత్యంత సమీపంలో ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, వెంటనే సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.