HYD: MNJ క్యాన్సర్ ఆసుపత్రికి వచ్చే రోగుల్లో ఊపిరితిత్తులు, ఉదరం సంబంధిత క్యాన్సర్ కేసులు ప్రతి ఏటా పెరుగుతున్నాయి. 2025లో ఊపిరితిత్తుల క్యాన్సర్ 785 మందిలో, ఉదరం సంబంధిత క్యాన్సర్ 445 మందిలో గుర్తించారు. నోటి, గొంతు క్యాన్సర్లు అధికంగా నమోదవుతున్నాయి. జీవనశైలి మార్పులు, పొగ త్రాగడం, మద్యం సేవనం వంటి అలవాట్లు ప్రధాన కారణాలు అని వైద్యులు తెలిపారు.