GNTR: కూటమి ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించిందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 25 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ప్రభుత్వం భారీ పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుందని వివరించారు. గ్రూప్-1, 2, పోలీస్, విద్య, పరిశ్రమల విభాగాల్లో పెద్ద ఎత్తున నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు.
E.G: ఉగాది సందర్భంగా సీతానగరంలోని శివాలయంలో గురువారం సాంస్కృతిక నృత్యాలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చదువుతో పాటు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్న పాఠశాలలను గ్రామస్థులు అభినందించారు. ఆలయ ప్రాంగణం భక్తులు, విద్యార్థులతో సందడిగా మారింది.
GDWL: ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా పథకం లబ్ధి పొందాలంటే గడువులోగా దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి అని ఏఈఓ చందన పేర్కొన్నారు. గట్టు మండలం ఇందువాసి గ్రామంలో రైతు భరోసా దరఖాస్తుల ప్రక్రియపై ఆమె స్పష్టతనిచ్చారు. గ్రామంలో దాదాపు 102 మంది రైతుల దరఖాస్తులు ఇంకా పూర్తి కాలేదని, సమయం చాలా తక్కువగా ఉన్నందున రైతులు వెంటనే స్పందించాలని కోరారు.
KNR: హుజూరాబాద్, కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని రైతులు జనగామ జిల్లా నర్మెట్టలో జరిగే రైతు ఉత్సవాలకు శుక్రవారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వం ఈనెల 19 నుంచి 22 వరకు నిర్వహించే రైతు ఉత్సవాలలో ప్రతి మండలం నుంచి రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.
NLG: ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. ఇవాళ నకిరేకల్ లోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు తోఫాను అందించారు. సోదర భావంతో మెలుగుతూ పండుగలను సామరస్యంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.
MDK: రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. జిల్లావ్యాప్తంగా 61 మందికి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పదవులు కేటాయించగా, సిద్ధిరాములుకు వైస్ ప్రెసిడెంట్ పదవి కేటాయించారు. కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.
PPM: బలిజిపేట మండలం శివరాంపురం పంచాయతి చెల్లింపేట బీసీ కాలనీలో రహదారి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలువలు నిర్మించినప్పటికీ సీసీ రోడ్డు వేయకపోవడంతో వర్షం పడితే నీరు నిలిచిపోయి బురదలో నడవడం కష్టంగా మారిందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్ధానికులు కోరుతున్నారు.
JN: రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దివ్యాంగుల భద్రత, సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మల్లికాంబ మనో వికాస కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించి మాట్లాడుతూ… మానసిక దివ్యాంగ చిన్నారుల కోసం పనిచేసే సంస్థలకు ప్రభుత్వ సహాయం మరింతగా అవసరమని, పిల్లలకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందజేస్తానని చెప్పారు.
పాక్ ప్లేయర్ల ముంగిట తమ క్రికెట్ బోర్డ్(PCB) సాగిలపడుతోందని ఆ దేశ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహ్జాద్ తీవ్ర విమర్శలు చేశాడు. ఇంత బలహీనంగా PCBని గతంలో ఎప్పుడూ చూడలేదని, ప్రస్తుత పాలక బోర్డ్ వల్ల ఏం కాదని విమర్శించాడు. కొత్త ప్లేయర్లను తీసుకొచ్చే అవకాశం ఉన్నా ప్రతిసారీ ఉన్న ప్లేయర్లతోనే ఏదో ట్రిక్ ప్లే చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశాడు.
RR: తెలంగాణలో నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. యాచారం మండలం గున్గల్ గ్రామస్తులైన రైతు కుటుంబానికి చెందిన ఆవ రమాదేవి-జంగయ్యల కుమారుడు ఆవ మోక్షిత్ 95 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి ప్రతిభకు గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
ATP: గుత్తిలో శుక్రవారం ఒక్కసారిగా చికెన్, మటన్ ధరలకు రెక్కలు వచ్చాయి. ఎన్నడు లేని విధంగా కేజీ చికెన్ ధర రూ.280 నుంచి రూ. 300, కేజీ మటన్ ధర రూ.750-రూ.800 వరకు ధర పలుకుతుందని చికెన్ షాప్ నిర్వాహకుడు షఫీ తెలిపారు. ప్రస్తుతం వేసవి కాలం నేపథ్యంలో కోళ్లు దొరకడం లేదని, అందుకే డిమాండ్ ఎక్కువగా ఉండడంతో చికెన్ ధరలు పెరిగాయి అన్నారు. దీంతో ప్రజలు అయోమయంలో పడ్డారు.
JGL: TGNPDCL పరిధిలో కొత్త సర్వీసుల కోసం సర్వీస్ లైన్ ఛార్జీల విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చామని SE బి. సుదర్శనం తెలిపారు. కొత్త LT కనెక్షన్లు, అదనపు లోడ్ కోసం సర్వీస్ లైన్ ఛార్జీలను సరళంగా, ఏకరీతిగా నిర్ణయించామన్నారు. స్థల పరిశీలన లేకుండా త్వరితగతిన కొత్త సర్వీసులు అందిస్తున్నామని అన్నారు. వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
TG: ప్రజాభవన్లోని నల్లపోచమ్మ ఆలయంలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రతులకు పూజలు నిర్వహించారు. అనంతరం బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీ కమిటీ హాలులో కేబినెట్ భేటికి బయలుదేరారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబెనెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇప్పటికే సీఎం రేవంత్, మంత్రులు అసెంబ్లీకి చేరుకున్నారు.
JGL: శక్తివంతమైన, ద్రుడమైన భారత నిర్మాణానికి కృషి చేయాలని RSS జిల్లా కార్యవాహ గొల్కొండ నాగరాజు అన్నారు. రాయికల్ పట్టణంలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ ఉగాది ఉత్సవానికి ఆయన హాజరయ్యారు. హిందూ పండుగలు ఖగోళ శాస్త్రం, ప్రకృతి మార్పులు, ధర్మం, అధర్మంపై సాధించిన విజయానికి ప్రతీకలని అన్నారు. జాతీయ సమైక్యత, విశ్వగురు భారత్ RSS ధ్యేయమని అయన పేర్కొన్నారు.
VKB: బొమ్మరాస్పేట మండలం మదన్పల్లిలో నిన్న ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. రహదారులన్నీ మంచు కురిసినట్లుగా తెల్లగా మారిపోయాయి. ఈ అకాల వర్షం వల్ల కూరగాయలు, ఇతర పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం చల్లబడినప్పటికీ, పంట నష్టం వారిని కోలుకోలేని దెబ్బ తీసింది.