MHBD: తెలంగాణ రాష్ట్ర మహిళా త్రోబాల్ జట్టు జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ప్రతిష్టాత్మకమైన ఫెడరేషన్ కప్ జాతీయ త్రోబాల్ పోటీల్లో ద్వితీయ స్థానం (రన్నరప్) సాధించి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. డోర్నకల్ మండలం, ఉయ్యాలవాడకి చెందిన తల్లూరి హరిచందన జట్టులో కీలక పాత్ర పోషించింది. దీంతో ఆమెపై ప్రశంసలు విలువెత్తుతున్నాయి.
RR: లింగంపల్లి రైల్వే స్టేషన్లో RPF, GRP పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో సూట్కేస్ దొంగను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.1,50,000 విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పాత కేసులతో కూడా సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ప్రయాణికుల భద్రత కోసం RPF నిరంతరం అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు.
NRPT: నర్వ మండల పాతర్చెడ్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ భవనాల భూమిపూజ గురువారం సర్పంచ్ లింగమ్మ, ఎంపీడీవో శ్రీనివాసులూ కలిసి నిర్వహించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచే లక్ష్యంతో కొత్త లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆంజనేయులు, మండల అధ్యక్షుడు చెన్నయ్య పాల్గొన్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. ఇవాళ్టి ట్రేడింగ్లో డాలర్తో పోలిస్తే రూపాయి 19 పైసలు క్షీణించి, చరిత్రలో తొలిసారిగా రూ.93.08కి చేరింది. ముడి చమురు ధరల పెరుగుదల, గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది. రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతులు ప్రియమై, ద్రవ్యోల్బణం పెరిగే ముప్పు పొంచి ఉంది.
ప్రకాశం: రాచర్ల మండలం ఆకవీడు గ్రామంలో మొక్కజొన్న రైతులు ఆర్గనైజర్ల మోసానికి గురయ్యారు. అధిక దిగుబడి వస్తుందని నమ్మబలికి విత్తనాలు ఇచ్చినప్పటికీ, పంట కోతకు కేవలం అరటన్ను మాత్రమే దిగుబడి రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు ఒక్కో ఎకరానికి సుమారు రూ.35,000 వరకు నష్టపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
NLG: యాసంగి వరి కోతలు ప్రారంభం కావడంతో జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి 14 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు, గతంలో ఉన్న 375 కేంద్రాలను 400కు పెంచాలని నిర్ణయించారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. అధికారుల కసరత్తుతో రైతులు హర్షం వ్యక్తమవుతోంది.
గాయం కారణంగా ఆస్ట్రేలియా ప్లేయర్లు పాట్ కమిన్స్(SRH), జోష్ హేజిల్వుడ్(RCB) ప్రారంభ IPL మ్యాచులకు దూరమైన సంగతి తెలిసిందే. వీరి బాటలోనే మిచెల్ స్టార్క్(DC) కూడా IPL ప్రారంభంలో కొన్ని మ్యాచులకు ఆడబోడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. వర్క్ లోడ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మరో ఆసీస్ ప్లేయర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
WGL: ఖానాపురం (M) కొత్తూరు గ్రామంలో భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నేడు భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అడ్వకేట్ వీరేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ సంఘాల నాయకులు, పూలే అభిమానులు, సామాజిక-రాజకీయ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినప్పుడు తెలిపారు.
MBNR: ఎండలు పెరుగుతుండటంతో గొర్రెల కాపరులు వలస బాట పట్టారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వేలాది గొర్రెలతో జోగులాంబ గద్వాల నడిగడ్డకు చేరుతున్నారు. నల్లరేగడి పొలాల్లో మేత పుష్కలంగా లభిస్తుందని, మూడు నెలలు ఇళ్లకు దూరంగా ఉండి గొర్రెలను మేపుతామని చెబుతున్నారు. వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల నుంచి ఎక్కువగా కాపరులు వస్తున్నారు.
సత్యసాయి: గత వైసీపీ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా యువతను మోసం చేసిందని మంత్రి సవిత విమర్శించారు. శుక్రవారం సోమందేపల్లి టీడీపీ కార్యాలయంలో మంత్రి మాట్లాడారు. ఎన్నికలలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఉగాది సందర్భంగా మంత్రి లోకేశ్ 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
MBNR: దేవరకద్ర మున్సిపాలిటీ మేనేజర్, ఏడో వార్డు అధికారులు ఇందిరమ్మ ఇండ్ల ఫొటోలు యాప్లో దశల వారీగా నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. కలెక్టర్ స్వయంగా 7వ వార్డు ఇండ్లను పరిశీలించి యాప్లో టెక్నికల్ సమస్యలేదని పేర్కొన్నారు.
E.G: యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చిన ప్రకారం ఉగాదిని పురస్కరించుకుని 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ చేసినట్లు రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ శుక్రవారం తెలిపారు. ఇప్పటి వరకు మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయుల పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ పోస్టులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో 9 వేల పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు.
ప్రకాశం: చంద్రశేఖరపురం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 25న బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఎల్ బ్రహ్మయ్య తెలిపారు. మండలంలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులు, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరు కావాలని కోరారు.
TG: క్యాన్సర్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. గతేడాది రాష్ట్రంలో 53,565 కొత్త కేసులు నమోదు కాగా, 29,300 మంది మరణించారు. సగటున 10 నిమిషాలకో కొత్త కేసు నమోదవుతోంది. దేశవ్యాప్తంగా 2025లో 15.69 లక్షల కేసులు, 8.68 లక్షల మరణాలు రికార్డయ్యాయి. కేంద్రం వెల్లడించిన ఈ గణాంకాలు ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేస్తున్నాయి.
KMM: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను ఇవాళ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు క్యాబినెట్ సమావేశంలో బడ్జెట్కు ఆమోదం తెలపనున్నారు. ఈ బడ్జెట్ సుమారు రూ. 3.36 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.