KMM: ఎమ్మెల్యే రాందాస్ మాలోత్ ఆదేశాల మేరకు ప్రార్థనల నిమిత్తం కేటాయించిన స్థలాన్ని శుక్రవారం వార్డు కౌన్సిలర్ శ్రావణి రత్నాకర్, నాయకుడు కాప మురళీకృష్ణ పర్యవేక్షించారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరుల ప్రార్థనల కోసం వైరాలోని 4వ వార్డులో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.