KNR: గంగాధర మండలం కాచిరెడ్డిపల్లిలో భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థను ఎస్సై వంశీకృష్ణ ప్రారంభించారు. SI వంశీ కృష్ణ మాట్లాడుతూ.. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను నియంత్రించడం, అనుమానాస్పద కదలికలను గుర్తించడం సులభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోలు మమత రాణి, ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.