ADB: ఈనెల 21న తాంసి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనగ పంట కొనుగోలు చేయడం జరుగుతుందని AMC సెంటర్ ఇంఛార్జ్ కేశవ్ శుక్రవారం తెలియజేశారు. మధ్యాహ్నం 12 గంటలకు కొనుగోలు ప్రారంభించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని గమనించి గ్రామాల వారీగా రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని కోరారు.