NLG: కేతపల్లి మండలం కొండకింది గూడెం గ్రామంలో జేసీబీలతో అక్రమంగా మట్టి తవ్వి టిప్పర్ల ద్వారా నకిరేకల్ ప్రాంతానికి తరలిస్తూ దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ కొనసాగుతోంది. దీనిని అడ్డుకున్న స్థానికులపై దాడులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.