KMM: సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు మార్చి 23 దేశవ్యాప్తంగా జాతీయోద్యమ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమాని విజయవంతం చేయాలని రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశంలో నాయకులు ఇవాళ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వలసవాద ధోరణిని మార్చుకోవాలని అన్నారు. ఈ నెల 23న జరగనున్న కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు భాగస్వామ్యం కావాలని కోరారు.