SDPT: తొగుట మండలం పెద్ద మాసాన్ పల్లి గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా గ్రామ సర్పంచ్ పన్యాల ప్రవీణ్ రెడ్డి గ్రామంలోని 10 ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశారు. గత 10 ఏళ్లుగా ఆయన ఈ తోఫాను అందజేస్తున్నారు. ఆయన చేస్తున్న సేవకు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోయిని శ్రీనివాస్, వార్డ్ సభ్యులు కిషన్, స్వామి, రాజు, మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.