TG: అసెంబ్లీలో రూ.3.24 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. కొత్తగా 5 పథకాలను ప్రతిపాదించారు. అందులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, సీఎం ఓవర్సీస్ ఎంప్లాయీమెంట్ ప్రోగ్రాం, దివ్యాంగ విద్యార్థులకు వాహనాల పథకం ఉంది.