RR: ప్రజల అవసరాలే మా మొదటి ప్రాధాన్యత అని నందిగామ మండలం చేగూరు సర్పంచ్ శ్రీశైలం అన్నారు. గ్రామంలోని 4,5,8 వార్డుల్లో శాశ్వత బోర్లను ప్రారంభించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వార్డుల్లో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని బోర్లను వేయించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకుడు గ్రామానికి ఎంతో అవసరమని అన్నారు.