MBNR: జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలో త్రాగునీటి శుద్ధి కేంద్రంను ఇవాళ ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. గ్రామ ప్రజలు కోరిన వెంటనే RO ప్లాంట్, హైమాక్స్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపీ ల్యాండ్ నిధుల నుంచి మొత్తం ఏడు నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు చేయించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతుందన్నారు.