JGL: మైతాపూర్ గ్రామంలో శ్రీ గిరి గుట్ట కనకదుర్గాదేవి ఆలయానికి మెయిన్ రోడ్డు నుంచి సిమెంట్ ఆధార నిర్మాణానికి హద్దులు చూపించాలని కోరుతూ వార్డు సభ్యులు శుక్రవారం రాయికల్ తహశీల్దార్ నాగార్జునకు వినతిపత్రం సమర్పించారు. రాజ్యసభ సభ్యుడు దామోదర రావు రూ.15 లక్షల నిధులు మంజూరు చేశారని, భూమికి సరిహద్దుల విషయంలో స్పష్టత లేకపోవడంతో వివాదం నెలకొందని పేర్కొన్నారు.