ADB: ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో NREGS మెటీరియల్ వ్యయం, వివిధ పెండింగ్ పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి మండలం, విభాగం వారీగా మెటీరియల్ కాంపోనెంట్ నిధులను వినియోగించుకుంటూ పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు.