BHNG: జీతాల పెంపు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జ్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. నిరసనకారుల న్యాయమైన కోరికను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.