KDP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల నియామకాలు చేపట్టిందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి శుక్రవారం ప్రొద్దుటూరులో తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో ఒక్క సచివాలయ ఉద్యోగులను తప్ప ఎవరికీ ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు.