BDK: చంద్రుగొండ మండలం తిప్పనపల్లి రెవిన్యూ, వెంకటాపురం గ్రామంలో అసైన్డ్ భూములను ఆక్రమిస్తున్న గిరిజనేతరులపై ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని శుక్రవారం ఆదివాసీ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. సర్వేనెంబర్ 116 లో ఉన్న అసైన్డ్ అక్రమలపై చర్యలు తీసుకోకపోతే తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఈనెల 23న ధర్నా నిర్వహిస్తున్నామని పిలుపునిచ్చారు.