W.G: గ్రామాలను అభివృద్ధి చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం ఎల్.విఎన్ పురం-అనాకోడేరు గ్రామంలో రూ.4.7 కోట్లతో రోడ్డు పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. 5.2 కిమీ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. రోడ్డు నిర్మాణాన్ని నాణ్యతతో నిర్మించాలని కాంట్రాక్టర్లకు సూచించారు.