GDWL: మానవపాడు మండలంలోని అమరవాయి ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఎంఈవో శివప్రసాద్ సందర్శించారు. ఆయన పాఠశాల రికార్డులను పరిశీలించి, విద్యార్థుల హాజరు శాతాన్ని సైతం పరిశీలించారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి అధ్యాపకులు బోధన ఎలా చెప్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు తరగతి విద్యార్థులతో తెలుగు, ఇంగ్లిష్ పాఠ్య పుస్తకాలను చదివించారు.