KMM: వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గురువారం ఉగాది పండుగను పురస్కరించుకున్నారు. ఈ నేపథ్యంలో జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంగీలాల్ నాయక్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజలకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అన్నారు.
AP: అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచనలు చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రైతులకు పూర్తి సహాయం అందించాలని తెలిపారు. రాష్ట్రంలో అకాల వర్షాలు పడటంతో తీవ్ర స్థాయిలో పంటలకు నష్టం కలగనుందని చెప్పారు. ఈ క్రమంలో ప్రజలు అత్యవసరం అయితేనే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని సూచించారు.
MBNR: కౌకుంట్ల వెంకటగిరిలో శ్రీ శ్రీ శ్రీ కోదండ రామాలయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పుణ్యకార్యానికి ఓ సంఘం సభ్యులు రూ.22 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి, నిర్వాహకులకు అందజేశారు. ఆలయ నిర్మాణంతో గ్రామానికి మేలు జరుగుతుందని వారు ఆకాంక్షించారు. భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆలయ పూర్తికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
WGL: ఓరుగల్లు సమగ్ర అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా నగరంలోని భద్రకాళి అమ్మవారి ఆలయం, వేయి స్తంభాల ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపేందుకు కష్టపడి పని చేస్తామన్నారు.
GDWL: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ను గురువారం జిల్లా అవాజ్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలో మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, మైనారిటీ బాలికల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో లేకపోవడంతో మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని విన్నవించారు.
అన్నమయ్య: మదనపల్లె టౌన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్ధవరం గ్రామానికి చెందిన శ్రీకాంత్ (27) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, సిద్ధవరం మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఈ ప్రమాదం జరిగింది. కుటుంబసభ్యులు అతడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
KRNL: రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడు ఎస్.అబ్బాస్ అన్నారు. ఉగాది సందర్భంగా 10 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ ప్రకటన యువతకు కానుకగా నిలిచిందన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్కు ధన్యవాదాలు తెలిపారు. యువత ఈ అవకాశాలను వినియోగించుకోవాలని ఇవాళ సూచించారు.
CTR: చిత్తూరు(M) తుమ్మిందపాళ్యం ధనకోటి గంగమ్మ ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తండ్రి, జిజేఎం ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవుల నాయుడు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కూటమి నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
ADB: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జాదవ్ నరేష్ గురువారం నూతన జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్బంగా నార్నూర్ మండల కేంద్రానికి చెందిన బానోత్ ప్రణీతను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ప్రజల సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని గమనిస్తూ ప్రణీతను నియమించినట్లు వెల్లడించారు. దీంతో పలువురు ఆమెను అభినందించారు.
అన్నమయ్య: మదనపల్లిలోని నీరుగట్టువారిపల్లె చౌడేశ్వరి నగర్కు చెందిన చేనేత కార్మికుడు రఘునాధ్ మునగ కాయలు కోయడానికి ఇంటి ఆవరణలోని చెట్టు ఎక్కాడు. కొమ్మ విరిగి విద్యుత్ వైర్లపై పడి కరెంట్ షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు అతడిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, సకాలంలో వైద్యులు వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.
TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది వేడుకల సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, పాలకమండలి సభ్యురాలు కోలా వైశాలి దంపతులను ఘనంగా సన్మానించారు. జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోలా ఆనంద్ మాట్లాడుతూ.. ఈ నూతన సంవత్సరం ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలను చేకూర్చాలని ఆకాంక్షించారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గురువారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ. 5,28,320 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 1231 మంది స్వామివారిని దర్శించుకున్నారని, అత్యధికంగా 117 ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించారని, 8900 మంది అన్న ప్రసాదం స్వీకరించారన్నారు.
ప్రకాశం: కనిగిరి ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. నెల 18 నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తుల స్వీకరణ, మే 3న ఎంపిక జాబితా ప్రదర్శన, 6న ధ్రువ పత్రాల పరిశీలన జరుగుతుందన్నారు. నిబంధనల మేరకు పదవ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు.
BDK: బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం శ్రీకారం చుట్టారు. సారపాకలో ఐటీసీ సీఎస్ఆర్ నిధుల ద్వారా సుమారు 7.5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రజా మరుగుదొడ్డిని ప్రారంభించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు.
MNCL: మంచిర్యాలకు చెందిన బోనగిరి శ్రీహర్షవర్ధన్ జాతీయ స్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లూరు సుధాకర్ తెలిపారు. మార్చి 21 నుంచి 25 వరకు గోవాలో జరగనున్న జాతీయ స్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీలలో శ్రీహర్షవర్ధన్ పాల్గొంటారని పేర్కొన్నారు. శ్రీహర్షవర్ధన్ను పలువురు అభినందించారు.