ASR: సాలూరు నియోజకవర్గ ప్రజల చిరకాల కల నెరవేరిందని మంత్రి సంధ్యారాణి అన్నారు. అత్యుత్తమ వైద్య సేవలను స్థానికులకు అందుబాటులోకి తీసుకువస్తూ, సుమారు రూ. 17 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల అత్యాధునిక ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి పాల్గొన్నారు.