బంగ్లాదేశ్లో గత 20 ఏళ్లలో లేనంతగా తట్టు వ్యాధి విలయతాండవం చేస్తోంది. టీకా కార్యక్రమాలు ఆలస్యం కావడంతో ఇప్పటివరకు 143 మంది మరణించగా, 12,000 మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు. మృతులలో ఎక్కువమంది చిన్నారులే ఉండటం విషాదకరం. ప్రస్తుతం UNO సహకారంతో ప్రభుత్వం 12 లక్షల మంది పిల్లలకు అత్యవసరంగా టీకాలు వేయించే కార్యక్రమాన్ని ప్రారంభించింది.