ADB: సిరికొండ మండలంలోని సోంపల్లి గ్రామంలో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ శుక్రవారం సాయంత్రం పర్యటించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన పలువురు బాధిత కుటుంబాలను ఎంపీ పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి మనోధైర్యంతో ఉండాలని సూచించారు. ఎంపీ వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.