AP: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం బ్రహ్మంగారి మఠం వారసత్వ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. గత నాలుగున్నరేళ్లుగా ఖాళీగా ఉన్న పీఠానికి నేడు 12వ తరం పీఠాధిపతిగా వెంకటాద్రిస్వామి పట్టాభిషేకం జరగనుంది. దేవదాయశాఖ నిబంధనల ప్రకారం ఆయన తాత్కాలిక పీఠాధిపతిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు.