PPM: కురుపాం మండలంలో వేసవి దాహం తీర్చేందుకు చర్యలు వేగం పుంజుకున్నాయి. క్రాస్ ప్రోగ్రామ్లో భాగంగా శనివారం బోర్ మెకానికులు గ్రామాల్లో పాడైన తాగునీటి బోర్లను మరమ్మతు చేశారు. నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక బోర్లను గుర్తించి పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు నీటిని జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు.