TG: ప్రధాని పదవిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందించిన కేంద్రమంత్రి బండి సంజయ్.. ప్రధాని కుర్చీ కుటుంబ వారసత్వం కాదు అని అన్నారు. ఇది ప్రజాస్వామ్యం.. నిజాం శైలి దర్బార్ కాదు అని విమర్శించారు. అయినా ప్రస్తుతం ప్రధాని పదవి ఖాళీగా లేదు అని తెలిపారు. దేశం అభివృద్ధి రంగులతో హోలీ జరుపుకుంటుంటే.. కాంగ్రెస్ అవినీతి మసితో మసకబారిందన్నారు.