AP: ఈ ఏడాది జూన్ నాటికి రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్నతాధికారులు, MLAలు, MLCల కోసం నిర్మిస్తున్న నివాసాల పనులు పూర్తవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం ప్రస్తుతం 30 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. 2028 డిసెంబర్ నాటికి రాజధానిలో నిర్మించ తలపెట్టిన ఐకానిక్ భవనాలు పూర్తవుతాయని చెప్పారు.