AP: ఉండవల్లిలోని స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. సీడ్ యాక్సిస్ రోడ్డును పాత గుంటూరు హైవేకు కలిపేలా ప్రభుత్వం స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతోంది. ఈ పనులను పరిశీలించిన మంత్రి.. కాంక్రీట్ పిల్లర్లపై స్టీల్ గడ్డర్ల ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు. స్టీల్ బ్రిడ్జ్ త్వరగా పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి వారికి సూచించారు.