TG: కోకాపేట శారదాపీఠం భూమిపై రెవెన్యూ అధికారులు వివరణ ఇచ్చారు. శారదాపీఠం భూమిని ప్రభుత్వం వాటర్వర్క్స్కు ఇవ్వాలనుకుందని వెల్లడించారు. శారదాపీఠానికి ప్రభుత్వమే గతంలో భూమి కేటాయించిందని తెలిపారు. ఆ భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. కోకాపేట భూమికి బదులు శంషాబాద్లో భూమి కేటాయిస్తామని స్పష్టం చేశారు.