AP: అమరావతికి చట్టబద్దతపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఏదో మహాద్భుతం జరిగినట్లు సీన్ చేస్తున్నారని.. మట్టికుప్పలపై పడుకుని సీఎం చంద్రబాబు డ్రామాలాడారని విమర్శించారు. ఇప్పటికే ఏపీపై రూ.50 వేల కోట్ల అప్పు భారం మోపారని తెలిపారు. రాజధానిపై నిజాలు మాట్లాడుకుందామని జగన్ అంటున్నారని.. చంద్రబాబు మాత్రం ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు.