AP: రాజధాని అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన రహదారులపై ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి, ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికుల ఆధార్ వివరాలు, వాహన నంబర్లను రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.